సన్యాసం స్వీకరించిన వాళ్ళను సన్యాసులు అంటాం. ఇక దీక్ష దీసుకుని పీఠాధిపత్యం వహించే వాళ్ళూ వున్నారు.
వీళ్ళను జగద్గురువులు, స్వాములు అంటాం. అయితే ఇందులో కూడా వివిధ ఆచార వ్యవహారాలకు సంబంధించిన వాళ్ళు వున్నారు. అదంతా పక్కన పెడితే స్వాములు చేతిలో కర్రలు పట్టుకుని ఉండడం చూస్తూంటాం. శ్రీ శ్రీ శ్రీ అని మూడు అక్షరాలు జోడించి స్వామి వారిని కీర్తిస్తాం. అయితే ఇలా కర్రలు ఎందుకు ధరిస్తారో చాలా మందికి తెలియదు. ఈ కర్రలలో ఏకదండి, ద్విదండి, త్రిదండి అనే మూడు విధాలు ఉన్నాయి.(దండి అంటే కర్ర అని అర్ధం). వీటి గురించి తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే.
2. ఐదడుగుల కర్ర...
ఈ కర్రలు వివిధ ఆకారాలలో ఉంటాయి. ప్రతీదానికి ఓ అర్ధం ఉంది. గాలి, నీరు, భూమి, అగ్ని, ఆకాశం అనే పంచభూతాల సమ్మేళనమే మనిషి, కాబట్టి సన్యాసులు ఐదడుగుల కర్ర ధరిస్తారు.
3. అద్వైత సిద్ధాంతం నమ్మేవాళ్ళు...
ఒక కర్రను(ఏకదండి) ధరించి ఉండేవారు అద్వైత సిద్ధాంతాన్ని నమ్మేవారు(ఆది శంకరాచార్యులు). అద్వైతం అనగా జీవుడు, దేవుడు ఒక్కటేననే సిద్ధాంతం. అంతరాత్మకు విరుద్ధంగా అక్రమ, అన్యాయ మార్గాన సంచరించినా, ప్రవర్తించినా ఆ పాపఫలితాన్ని బ్రతికి ఉండగానే ఏదో ఒక రూపంలో ఇక్కడే తప్పకుండా అనుభవించక తప్పదు అనే సిద్ధాంతాన్ని వారు బోధిస్తారు. వీరి చేతిలో జ్ఞానానికి సంకేతమైన రావిచెట్టు నుండి సేకరించిన ఒక కర్ర ఉంటుంది
4. మధ్వాచార్యులు...
రెండు కర్రలు కలిపి ఒక్కటిగా కట్టి(ద్విదండి) ధరించి బోధనలు చేసేవారు ద్వైత సిద్ధాంతం కలవారు (మధ్వాచార్యులు). వీరిని ద్విదండి స్వాములు , జీయరులని అంటారు వీరందరూ వైష్ణవ భక్తులే. వీరు దేవుడు వేరు జీవుడు వేరు అని బోధిస్తారు. జీవాత్మ పరమాత్మ వేరువేరు అనే ఈ సిద్ధాంతాన్నే భారతయుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునునికి బోధిస్తాడు.
5. విశిష్ఠాద్వైతము...
మూడు కర్రలను ఒకే కట్టగా కట్టి(త్రిదండి) భుజాన పెట్టుకునేవారు కూడా ఉన్నారు. దీనిని తత్వత్రయం అంటారు. ఇలా ధరించే వారు విశిష్ఠాద్వైతమును బోధిస్తారు(రామానుజాచార్యులు). శరీరములో జీవుడున్నట్లే, జీవునిలో అంతర్యామిగా శ్రీమన్నారాయణుడు ఉంటాడని, జీవాత్మ, పరమాత్మ, ప్రకృతి సత్యములని, ఈ మూడింటిని నారాయణ తత్వంగా నమ్ముతూ, జీవుడు ఆజ్ఞానముతో సంసార బంధమున చిక్కుకుంటాడని, నారాయణుని శరణు వేడిన వారికి భగవంతుని అణుగ్రహం వలన అజ్ఞానమునుండి విముక్తులై, మరణానంతరము నారాయణ సాన్నిధ్యము, మోక్షము పొందుతారని, వారికి మరుజన్మ ఉండదని విశిష్ఠాద్వైతపు సిద్ధాంతాన్ని బోధిస్తారు. వీళ్ళను కూడా జీయర్లు అంటారు.
వీళ్ళను జగద్గురువులు, స్వాములు అంటాం. అయితే ఇందులో కూడా వివిధ ఆచార వ్యవహారాలకు సంబంధించిన వాళ్ళు వున్నారు. అదంతా పక్కన పెడితే స్వాములు చేతిలో కర్రలు పట్టుకుని ఉండడం చూస్తూంటాం. శ్రీ శ్రీ శ్రీ అని మూడు అక్షరాలు జోడించి స్వామి వారిని కీర్తిస్తాం. అయితే ఇలా కర్రలు ఎందుకు ధరిస్తారో చాలా మందికి తెలియదు. ఈ కర్రలలో ఏకదండి, ద్విదండి, త్రిదండి అనే మూడు విధాలు ఉన్నాయి.(దండి అంటే కర్ర అని అర్ధం). వీటి గురించి తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే.
2. ఐదడుగుల కర్ర...
ఈ కర్రలు వివిధ ఆకారాలలో ఉంటాయి. ప్రతీదానికి ఓ అర్ధం ఉంది. గాలి, నీరు, భూమి, అగ్ని, ఆకాశం అనే పంచభూతాల సమ్మేళనమే మనిషి, కాబట్టి సన్యాసులు ఐదడుగుల కర్ర ధరిస్తారు.
3. అద్వైత సిద్ధాంతం నమ్మేవాళ్ళు...
ఒక కర్రను(ఏకదండి) ధరించి ఉండేవారు అద్వైత సిద్ధాంతాన్ని నమ్మేవారు(ఆది శంకరాచార్యులు). అద్వైతం అనగా జీవుడు, దేవుడు ఒక్కటేననే సిద్ధాంతం. అంతరాత్మకు విరుద్ధంగా అక్రమ, అన్యాయ మార్గాన సంచరించినా, ప్రవర్తించినా ఆ పాపఫలితాన్ని బ్రతికి ఉండగానే ఏదో ఒక రూపంలో ఇక్కడే తప్పకుండా అనుభవించక తప్పదు అనే సిద్ధాంతాన్ని వారు బోధిస్తారు. వీరి చేతిలో జ్ఞానానికి సంకేతమైన రావిచెట్టు నుండి సేకరించిన ఒక కర్ర ఉంటుంది
4. మధ్వాచార్యులు...
రెండు కర్రలు కలిపి ఒక్కటిగా కట్టి(ద్విదండి) ధరించి బోధనలు చేసేవారు ద్వైత సిద్ధాంతం కలవారు (మధ్వాచార్యులు). వీరిని ద్విదండి స్వాములు , జీయరులని అంటారు వీరందరూ వైష్ణవ భక్తులే. వీరు దేవుడు వేరు జీవుడు వేరు అని బోధిస్తారు. జీవాత్మ పరమాత్మ వేరువేరు అనే ఈ సిద్ధాంతాన్నే భారతయుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునునికి బోధిస్తాడు.
5. విశిష్ఠాద్వైతము...
మూడు కర్రలను ఒకే కట్టగా కట్టి(త్రిదండి) భుజాన పెట్టుకునేవారు కూడా ఉన్నారు. దీనిని తత్వత్రయం అంటారు. ఇలా ధరించే వారు విశిష్ఠాద్వైతమును బోధిస్తారు(రామానుజాచార్యులు). శరీరములో జీవుడున్నట్లే, జీవునిలో అంతర్యామిగా శ్రీమన్నారాయణుడు ఉంటాడని, జీవాత్మ, పరమాత్మ, ప్రకృతి సత్యములని, ఈ మూడింటిని నారాయణ తత్వంగా నమ్ముతూ, జీవుడు ఆజ్ఞానముతో సంసార బంధమున చిక్కుకుంటాడని, నారాయణుని శరణు వేడిన వారికి భగవంతుని అణుగ్రహం వలన అజ్ఞానమునుండి విముక్తులై, మరణానంతరము నారాయణ సాన్నిధ్యము, మోక్షము పొందుతారని, వారికి మరుజన్మ ఉండదని విశిష్ఠాద్వైతపు సిద్ధాంతాన్ని బోధిస్తారు. వీళ్ళను కూడా జీయర్లు అంటారు.

No comments:
Post a Comment