హనుమంతుడికి ఆకుపూజ చేస్తే అనేక గండాలు, ఆర్థిక ఇబ్బందులు, ఈతిబాధలు
తొలగిపోతాయని అంటారు. హనుమంతుడు లంకానగారానికి వెళ్లి సీతమ్మవారి జాడను
తెలుసుకుని, ఆమెకి ధైర్యం చెప్తాడు
. శ్రీరాముడి సైన్యం పట్ల లంకానగర వాసులకు భయం కలిగేలా చేస్తాడు. ఆ తరువాత సీతమ్మ ను చూసిన విషయం, తిరిగి వచ్చి రాముడిని చెబుతాడు. శుభవార్తను తెచ్చినవారికి తమ దగ్గర గల ఖరీదైన వస్తువును బహూకరించడం అప్పట్లో ఒక సంప్రదాయంగా ఉండేది.
. శ్రీరాముడి సైన్యం పట్ల లంకానగర వాసులకు భయం కలిగేలా చేస్తాడు. ఆ తరువాత సీతమ్మ ను చూసిన విషయం, తిరిగి వచ్చి రాముడిని చెబుతాడు. శుభవార్తను తెచ్చినవారికి తమ దగ్గర గల ఖరీదైన వస్తువును బహూకరించడం అప్పట్లో ఒక సంప్రదాయంగా ఉండేది.
అయితే ఆ శ్రీరాముడు అక్కడ గల తమలపాకులను తెంపి మాలగా చేసి హనుమంతుడి మేడలో
వేసి అభినందిస్తాడు. హనుమంతుడు లంకా నగరంలోని కొన్ని భవనాలను తగలబెట్టి
రావడంతో ఆయన శరీరం వేడిగా ఉండటంతో, తాపాన్ని తగ్గించడం కోసం రాముడు ఆయన
మెడలో తమలపాకుల మాలను వేసినట్టు పురాణాలు చెబుతున్నాయి.
ఆ తమలపాకుల మాల మెడలో పడగానే అప్పటివరకూ హనుమంతుడు పడిన శ్రమనంతా మరిచిపోయి ఆనందంతో పొంగిపోయాడు. అందుకే హనుమంతుడు పూలతో కూడిన పూజతో కంటే ఆకు పూజకే అధిక ప్రాధాన్య ఇస్తాడని పండితులు అంటున్నారు.
ఆ తమలపాకుల మాల మెడలో పడగానే అప్పటివరకూ హనుమంతుడు పడిన శ్రమనంతా మరిచిపోయి ఆనందంతో పొంగిపోయాడు. అందుకే హనుమంతుడు పూలతో కూడిన పూజతో కంటే ఆకు పూజకే అధిక ప్రాధాన్య ఇస్తాడని పండితులు అంటున్నారు.

No comments:
Post a Comment