కేరళలో ఉన్న అనంత పద్మనాభ స్వామి ఆలయం గురించి తెలిసిన వారు, ఆ ఆలయాన్ని దర్శించిన వారు చాలామంది ఉంటారు మనలో. అయితే ఇప్పుడు అనంత పద్మనాభ స్వామి ‘అనంతకాడు’ లో ఎందుకు వేలిశాడో తెలుసుకుందాం.
కేరళలో కలియుగం మొదలైన 950 ఏళ్ల కాలంలో విలువ మంగళ స్వామియర్ అనే విష్ణు భక్తుడు ఉండేవాడు. ఆ విష్ణు భక్తుడు ఎప్పుడూ ఆ స్వామి దర్శనం కోసం పూజలు, తపస్సులు చేసేవాడు. ఒక రోజు అతని ఇంటికి అందంగా ఉండే ఓ పిల్లవాడు వచ్చాడు. ఆ పిల్లవాడు స్వామియర్ కి బాగా నచ్చి ‘నువ్వు నా దగ్గరే ఉండిపో’ అని అడిగాడు. దానికి ఆ పిల్లవాడు “నేను నీ దగ్గరే ఉంటాను కానీ, ఏ రోజు నువ్వు నన్ను మర్యాదగా చూసుకోవో, ఆ రోజు ‘అనంతకాడు’ అనే ప్రదేశానికి నేను వెళ్ళిపోతాను” అని ఒక చెప్పగా, దానికి స్వామియర్ సరే అన్నాడు.
పిల్లవాడు అంటే పిల్లవాడే కదా అందుకని తన అల్లరితో ఎప్పుడు విసిగించేవాడు. ఒక రోజు స్వామియర్ పూజలో ఉండగా.. తాను పూజించే విష్ణు విగ్రహంతో ఆ పిల్లవాడు ఆడుకునున్నాడని, కోపం వచ్చిన స్వామియర్ ఆ పిల్లవాడిని మందలించాడు. వెంటనే ఆ పిల్లవాడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మళ్ళీ వెంటనే స్వామియర్ ఆ పిల్లవాడిని వెతుక్కుంటూ ‘అనంతకాడు’ అనే ప్రదేశానికి వెళ్ళగా, అక్కడ ఆ పిల్లవాడు స్వామియర్ కళ్ళముందే, ఓ చెట్టులోకి వెళ్ళిపోయాడు.
]
వెంటనే ఆ చెట్టు 13 కిలోమీటర్ ల పొడవు ఉన్న ఓ మహా వృక్షం లా మారి.. కింద పడి 5 పడగలు ఉన్న శేషు పాములా పవనిస్తున్న మహా విష్ణువు లా మారి పోయింది. అప్పుడు ఆ పిల్లవాడే మహా విష్ణువు అని అర్ధం చేసుకొని.. ఆ విగ్రహాన్ని చిన్నగా మారాలని కోరగా, వెంటనే ఆ విగ్రహం 18 అడుగుల విగ్రహంలా మారింది. స్వామియర్, అప్పటి రాజు కలసి ఆ విగ్రహానికి గుడి కట్టారు. అదే అనంత పద్మనాభ స్వామి గుడి.
No comments:
Post a Comment